ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఆగష్టు 4
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం లోని నేలకొండపల్లి మండలము లో బిజెపి మండలఅధ్యక్షుడు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన పైనంపల్లి గ్రామంలో బూత్ నంబర్ 271,272, లలో బూత్ అధ్యక్షులు కొండా రవి బాబు,కారంగుల వీరయ్య ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ *ఇంటింటికి బిజెపి, ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు* కార్యక్రమం జగింది. ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పాల్గొన్నారు.
మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన
అనంతరం మండల, జిల్లా నాయకులతో కలిసి ప్రతి గడపకు వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పనులను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ , సీనియర్ నాయకులు మన్నే కృష్ణా రావు,భవనాసి దుర్గారావు,సూరేపల్లి జ్ఞానరత్నం,మహ్మద్ షరీఫుద్దీన్,తంగెళ్ల సతీష్ కందరబోయిన వెంకటరమణ మన్నే రాధా కృష్ణ,
బాజా రామకృష్ణ రావు, గెల్లా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.


