Thursday, 26 March 2026
  • Home  
  • కేంద్ర బాల సాహిత్య అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ గారికి వెల్ వాకర్స్ వింగ్ ఘన సన్మానం
- Featured - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కేంద్ర బాల సాహిత్య అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ గారికి వెల్ వాకర్స్ వింగ్ ఘన సన్మానం

నెల్లూరు, జూన్  (పున్నమి ప్రతినిధి) తెలుగు బాల సాహిత్య ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించిన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి, వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వింగ్ అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ, “మా గౌరవాధ్యక్షుడు శివకుమార్ గారు కేంద్ర స్థాయిలో బాల సాహిత్యంలో అవార్డు అందుకోవడం ప్రతి నెల్లూరివాడి గర్వకారణం” అన్నారు. శివకుమార్ గారు దాదాపు 400 పిల్లల కథలు రాసి, వాటిలో 36 కథలతో రూపొందిన “కబుర్లు చెప్పే దేవత” పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం ఒక అసాధారణ ఘనత. ఇది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక ఎంపిక కావడం గర్వించదగ్గ విషయం. ఈ విజయం నెల్లూరు జిల్లాలోని సాహిత్యప్రియులకు, రచయితలకు, కవులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు మాట్లాడుతూ, “పిల్లలతో జతగా ఉండే కథలు రాయడం నాకు ఎనలేని ఆనందం ఇస్తుంది. ఇది కేవలం అవార్డు కోసమే కాదు, వారి మనస్సులను ఆకర్షించేందుకు నా ప్రయత్నం.” అని చెప్పారు. కార్యక్రమంలో సభ్యులైన నిసార్ఆలి, రాజారెడ్డి, నరసింహారావు, మహిళా ప్రతినిధులు శిఖరం రాజేశ్వరి, శేషమ్మ, సుబ్బమ్మ, జోష్నమ్మ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత నెల్లూరు జిల్లా సాహిత్య చరిత్రలో మరొక వెలకట్టలేని అధ్యాయంగా నిలిచింది.

నెల్లూరు, జూన్  (పున్నమి ప్రతినిధి)

తెలుగు బాల సాహిత్య ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించిన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి, వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వింగ్ అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ, “మా గౌరవాధ్యక్షుడు శివకుమార్ గారు కేంద్ర స్థాయిలో బాల సాహిత్యంలో అవార్డు అందుకోవడం ప్రతి నెల్లూరివాడి గర్వకారణం” అన్నారు.

శివకుమార్ గారు దాదాపు 400 పిల్లల కథలు రాసి, వాటిలో 36 కథలతో రూపొందిన “కబుర్లు చెప్పే దేవత” పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం ఒక అసాధారణ ఘనత. ఇది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక ఎంపిక కావడం గర్వించదగ్గ విషయం. ఈ విజయం నెల్లూరు జిల్లాలోని సాహిత్యప్రియులకు, రచయితలకు, కవులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు మాట్లాడుతూ,

“పిల్లలతో జతగా ఉండే కథలు రాయడం నాకు ఎనలేని ఆనందం ఇస్తుంది. ఇది కేవలం అవార్డు కోసమే కాదు, వారి మనస్సులను ఆకర్షించేందుకు నా ప్రయత్నం.” అని చెప్పారు.

కార్యక్రమంలో సభ్యులైన నిసార్ఆలి, రాజారెడ్డి, నరసింహారావు, మహిళా ప్రతినిధులు శిఖరం రాజేశ్వరి, శేషమ్మ, సుబ్బమ్మ, జోష్నమ్మ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఘనత నెల్లూరు జిల్లా సాహిత్య చరిత్రలో మరొక వెలకట్టలేని అధ్యాయంగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.