అనంతసాగరం మండలం: అనంతసాగరం ఎస్ఐ ఎన్. ప్రభాకర్ గారు తన సిబ్బందితో కలిసి అనంతసాగరం బస్టాండ్ సెంటర్ నుండి గంగుంట క్రాస్ రోడ్డు వరకు కరోనా పై అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల సూచన మేరకు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని దగ్గర్లోని ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం నందు కూడా ఒక కేసు నమోదు అయిందని రెండవ దశ మొదలవడంతో ప్రజలలో మళ్లీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అలాగే ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు కూడా మా మాస్కులు ధరించాలని వాహనాలు నడిపే వారు కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించాలని అలా లేనియెడల వారికి ఫైన్ విధించడం జరుగుతుందని తెలిపారు. అనంతసాగరం మండల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని వ్యక్తిగత దూరం పాటించాలని శానిటైజర్లు వినియోగించుకోవాలని,2020లో కరోనా కట్టడిలో ప్రజలు ఎలా సహకరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా సహకరించి కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలని కోరారు.
అనంతసాగరం మండలం: అనంతసాగరం ఎస్ఐ ఎన్. ప్రభాకర్ గారు తన సిబ్బందితో కలిసి అనంతసాగరం బస్టాండ్ సెంటర్ నుండి గంగుంట క్రాస్ రోడ్డు వరకు కరోనా పై అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల సూచన మేరకు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని దగ్గర్లోని ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం నందు కూడా ఒక కేసు నమోదు అయిందని రెండవ దశ మొదలవడంతో ప్రజలలో మళ్లీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అలాగే ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు కూడా మా మాస్కులు ధరించాలని వాహనాలు నడిపే వారు కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించాలని అలా లేనియెడల వారికి ఫైన్ విధించడం జరుగుతుందని తెలిపారు. అనంతసాగరం మండల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని వ్యక్తిగత దూరం పాటించాలని శానిటైజర్లు వినియోగించుకోవాలని,2020లో కరోనా కట్టడిలో ప్రజలు ఎలా సహకరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా సహకరించి కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలని కోరారు.