Thursday, 10 September 2026
  • Home  
  • 28 పీఎం శ్రీ పాఠశాలలకు 167 రకాల ఆటవస్తువులు రూ.14 లక్షలతో సరఫరాకు టెండర్లు.. స్థానిక అభ్యర్థులకే అవకాశం
- ఖమ్మం

28 పీఎం శ్రీ పాఠశాలలకు 167 రకాల ఆటవస్తువులు రూ.14 లక్షలతో సరఫరాకు టెండర్లు.. స్థానిక అభ్యర్థులకే అవకాశం

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలలకు 167 రకాల ఆటవస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.14 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లా అభ్యర్థులు మాత్రమే టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టెండర్ రుసుము రూ.4,000, డిపాజిట్ రూ.50,000గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. టెండర్లను ఈ నెల 19న ఉదయం 11 గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తెరవనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలలకు 167 రకాల ఆటవస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.14 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లా అభ్యర్థులు మాత్రమే టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టెండర్ రుసుము రూ.4,000, డిపాజిట్ రూ.50,000గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. టెండర్లను ఈ నెల 19న ఉదయం 11 గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తెరవనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.