19న ‘ఏజెన్సీ బంద్’
ఉస్మానియా యూనివర్సిటీ: పోలీస్ ఉద్యోగాలు
వైరా:
భర్తీలో జీవో నంబర్ 49 ప్రకారం 75 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ భూక్య కుమార్, ఏజెన్సీ రిజర్వేషన్ల సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి సోమేష్ జాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రిజర్వే షన్లు అమలు చేయకుంటే ఏజెన్సీ నిరుద్యోగు లకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19న వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు మండలం కారేపల్లి మండలం కామేపల్లి మండలం కు‘ఏజెన్సీ బంద్’కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్, బానోత్ మురళీకృష్ణ
, రజనీకాంత్, గణేష్, సంపత్, శ్రవణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



