నరసింహులపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బంజారా జాతి హక్కుల కోసం పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
*🚔 స్థలం: నరసింహులపేట పోలీస్ స్టేషన్*
*అరెస్ట్ అయిన వారు: సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, LHPS మండల అధ్యక్షుడు ఉదయ్ నాయక్, వీరు నాయక్, శంకర్ నాయక్*
*🔥 నాయకుల ఆగ్రహం: “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బంజారాల ఓట్లే కారణం. కానీ గెలిచాక హామీలు మరిచిపోయి, మమ్మల్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం.” అని నేతలు మండిపడ్డారు.*
*📌 ప్రధాన డిమాండ్లు*
✅ హైదరాబాద్ నగర కేంద్రంలోనే సేవలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం నిర్మించాలి.
✅ ప్రతి జిల్లాలో బంజారా భవనాలు ఏర్పాటు చేయాలి.
✅ బంజారాలకు తక్షణమే మంత్రి పదవి కేటాయించాలి.
తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని బంజారా సంఘాలు హెచ్చరించాయి.


