*నాయుడుపేట, ఆగస్టు 14, 2026:*
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, నాయుడుపేట పట్టణంలో *“హర్ ఘర్ తిరంగా ర్యాలీ”* ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనున్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు *డా. నెలవల విజయశ్రీ గారి* ఆధ్వర్యంలో ఈరోజు (శుక్రవారం) ఉదయం గాంధీ మందిరం నుంచి బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని దేశభక్తిని చాటారు.
ఈ కార్యక్రమంలో *నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు* పాల్గొని జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
ర్యాలీ సందర్భంగా *“వందేమాతరం”, “భారత్ మాతాకీ జై”* వంటి నినాదాలతో నాయుడుపేట పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. జాతీయ జెండాతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యత స్ఫూర్తిని మరింత పెంపొందించింది.
ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ కూటమి నాయకులు, జనసేన నాయకులు బాలు శెట్టి, చరణ్, కుమార్, జ్యోతిష్, దినేష్, మరియు వీర మహిళలు రోహిణి, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పట్టణ పౌరులు తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు


