*విశాఖపట్నం డిసెంబర్ 5పున్నమి ప్రతినిధి*
విశాఖపట్నం సిటీ ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.
ఈ పోలీస్ స్టేషన్ గత *మంతా తుఫాను* సమయములో చెట్లు కూలి శిథిలమైనది తరువాత దీనిని శాశ్వత ప్రాతిపదికన నిర్మించుటకు శ్రీ సి పి గారు నిధులు మంజూరి చేసినారు ప్రస్తుతము ఈ భవనము అధునాతన నిర్మాణము చేయబడినది అధికారులు మరియు సిబ్బంది సంతృప్తికరముగా పనిచేయుటకు కావలసిన సౌకర్యములు అందించబడినవి.
ఈ కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ మిగిలిన పోలీస్ స్టేషన్లో వాటి యొక్క జీవితకాలము పెంచుటకు మరియు సిబ్బంది సౌకర్య వంతముగా విధులు నిర్వ ర్తించుటకు కావలసిన మర మ్మతులు మరియు అదనపు సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి-01 శ్రీ మణికంఠ చెందోలు ఐ.పి.ఎస్.,,డిసిపి (క్రైమ్స్) శ్రీమతి లతా మాధురి ఐ.పీ.ఎస్.,,ఏసీబీ (క్రైమ్స్) ఏ.నరసింహ మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.


