సింగరేణి హెల్త్ కార్డుల సేవల్లో కార్మికులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సమాన వైద్యం అందించాలని విప్లవ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. హెల్త్ కార్డుల వినియోగంలో చికిత్సలు, ఆసుపత్రుల ఎంపిక, నగదు రహిత వైద్యంలో వ్యత్యాసాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో TNTUC రాష్ట్ర కార్యదర్శి T. మని రాంసింగ్, AIFTU రాష్ట్ర కార్యదర్శి M. పోచమల్లు, SGKS రాష్ట్ర నాయకులు అంబాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలపై కార్మిక సంఘాల డిమాండ్
సింగరేణి హెల్త్ కార్డుల సేవల్లో కార్మికులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సమాన వైద్యం అందించాలని విప్లవ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. హెల్త్ కార్డుల వినియోగంలో చికిత్సలు, ఆసుపత్రుల ఎంపిక, నగదు రహిత వైద్యంలో వ్యత్యాసాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో TNTUC రాష్ట్ర కార్యదర్శి T. మని రాంసింగ్, AIFTU రాష్ట్ర కార్యదర్శి M. పోచమల్లు, SGKS రాష్ట్ర నాయకులు అంబాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

