సింగరేణి కాలరీస్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. 1997 నుంచి కొనసాగుతున్న ఈ సమస్యపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం సుమారు 90 వేల మంది ఉద్యోగుల్లో 128 మంది మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. చట్టపరమైన చిక్కుల కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగేస్తున్న నేపథ్యంలో, ఏ ఒక్క అధికారిపై భారం పడకుండా కమిటీ సిఫార్సుల ఆధారంగా శాశ్వత పరిష్కారం చూపిస్తామని భట్టి స్పష్టం చేశారు

సింగరేణి మారుపేర్ల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం
సింగరేణి కాలరీస్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. 1997 నుంచి కొనసాగుతున్న ఈ సమస్యపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం సుమారు 90 వేల మంది ఉద్యోగుల్లో 128 మంది మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. చట్టపరమైన చిక్కుల కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగేస్తున్న నేపథ్యంలో, ఏ ఒక్క అధికారిపై భారం పడకుండా కమిటీ సిఫార్సుల ఆధారంగా శాశ్వత పరిష్కారం చూపిస్తామని భట్టి స్పష్టం చేశారు

