అనకాపల్లి జిల్లా, ఆగస్టు 11 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
పాయకరావుపేట నియోజకవర్గంలోని ఏటికొప్పాక సహకార చక్కెర ఫ్యాక్టరీ భూములు, ఆస్తులను విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రైతుల శ్రమతో ఏర్పడిన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించకుండా కాపాడాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుమ్మెళ్ల గోవిందరావు డిమాండ్ చేశారు. మూతపడిన ఫ్యాక్టరీలను పునరుద్ధరించి చెరకు రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రైతులు, కార్మికులు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

సహకార చక్కెర ఫ్యాక్టరీ ఆస్తుల అమ్మకాన్ని అడ్డుకోవాలి
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 11 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): పాయకరావుపేట నియోజకవర్గంలోని ఏటికొప్పాక సహకార చక్కెర ఫ్యాక్టరీ భూములు, ఆస్తులను విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రైతుల శ్రమతో ఏర్పడిన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించకుండా కాపాడాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుమ్మెళ్ల గోవిందరావు డిమాండ్ చేశారు. మూతపడిన ఫ్యాక్టరీలను పునరుద్ధరించి చెరకు రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రైతులు, కార్మికులు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

