ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నందలూరు శాఖ ఆధ్వర్యం లో శ్రీ సౌమ్యనాథ స్వామివారి కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు,వాటర్ బాటిల్స్ పంపిణీ చెయ్యడం జరిగింది. ముందుగా రాజంపేట రీజినల్ మేనేజర్ రాఘవేంద్ర, నందలూరు మేనేజర్ కళ్యాణి లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం భక్తులకు మజ్జిగ వాటర్ బాటిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ పల్లె సుబ్రహ్మణ్యం, గ్రామీణ బ్యాంకు స్టాఫ్ జాహ్నవిదర్,రవికుమార్, శ్రీనివాసరావు,శ్రీరామ్ కుమార్,ప్రవీణ్,శ్రీకాంత్,విశ్వ,మణి పాల్గొన్నారు.
భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న బ్యాంక్ అధికారులు




