Tuesday, 18 August 2026
  • Home  
  • శ్రీ రామాలయ పునర్నిర్మాణానికి శ్రీ రామారావు పటేల్ పవార్ శంకుస్థాపన..
- నిర్మల్

శ్రీ రామాలయ పునర్నిర్మాణానికి శ్రీ రామారావు పటేల్ పవార్ శంకుస్థాపన..

విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం.! ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు…. లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో శ్రీ రామాలయ పునర్నిర్మాణ పనులకు ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు శంకుస్థాపన చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన CGF నిధులు రూ.40 లక్షలతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి ప్రతీకలైన ఆలయాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర కట్టుబడి ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం క్రీడా ప్రాంగణం ప్రారంభం. గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. విద్య, వైద్యం, సాగునీటికి అధిక ప్రాధాన్యం. నియోజకవర్గ అభివృద్ధిలో విద్య, వైద్యం, సాగునీరు ప్రధాన అంశాలుగా ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజుర గ్రామానికి సంబంధించిన రోడ్ల మరమ్మతులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, గోవింద్ చెరువు మరమ్మతులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఉపాధ్యాయులను కేటాయించేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు డైనింగ్ హాల్ అవసరాన్ని కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు. రాజుర గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో రహదారులు, సాగునీరు, తాగునీరు, విద్య, పాఠశాల మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టి రాజుర గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం.!

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు….

లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో శ్రీ రామాలయ పునర్నిర్మాణ పనులకు ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు శంకుస్థాపన చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన CGF నిధులు రూ.40 లక్షలతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి ప్రతీకలైన ఆలయాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర కట్టుబడి ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు.
విద్యార్థుల కోసం క్రీడా ప్రాంగణం ప్రారంభం.
గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
విద్య, వైద్యం, సాగునీటికి అధిక ప్రాధాన్యం.
నియోజకవర్గ అభివృద్ధిలో విద్య, వైద్యం, సాగునీరు ప్రధాన అంశాలుగా ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
రాజుర గ్రామానికి సంబంధించిన రోడ్ల మరమ్మతులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, గోవింద్ చెరువు మరమ్మతులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలి.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఉపాధ్యాయులను కేటాయించేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతానని తెలిపారు.
అలాగే పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు డైనింగ్ హాల్ అవసరాన్ని కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు.
రాజుర గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో రహదారులు, సాగునీరు, తాగునీరు, విద్య, పాఠశాల మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టి రాజుర గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.