శ్రీ బాలాజీ కోలాట భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి వైభవంగా “సారె” సమర్పణ🙏🙏🙏🙏
ఆషాడమాసాన్ని పురస్కరించుకుని శ్రీ బాలాజీ కోలాట భక్త బృందం ఆధ్వర్యంలో భవానీపురంలో టెలిఫోన్ కాలనీ,బాలాజీ టవర్స్ అపార్మెంట్ వద్ద అమ్మవారి సారె సమర్పణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది.
భవానిపురం టెలిఫోన్ కాలనీలోని బాలాజీ టవర్స్ నుండి ప్రారంభమై న ఈ శోభాయాత్రలో కోలాట బృంద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంగళవాయిద్యాలు, అమ్మవారి నామస్మరణలు, కీర్తనల నడుమ భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం అమ్మవారికి ఆషాడమాస సాంప్రదాయ ప్రకారం పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు మరియు ఫలహారాలతో కూడిన ప్రత్యేక సారెను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ఊరేగింపులో స్థానిక భక్తులు, మహిళలు, శ్రీ బాలాజీ కోలాట భక్త బృందం ప్రతినిధులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు.


