టీడీపీ సీనియర్ నేత మన్నవ రవిచంద్ర సతీమణి విజయకుమారి వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం సుమారు 20 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున స్కాలర్షిప్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, ఎన్ఎస్ ఫౌండేషన్ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు బొల్లగుంట గిరిధర్ నాయుడు, మాజీ కౌన్సిలర్లు మలిశెట్టి విజయలక్ష్మి, కుందూరి కిరణ్, కూరపాటి శ్రీనివాసులు, మంచాల ప్రసాద్, పోతుగంటి శ్రీకాంత్, పులుపాటి రాజా, చినకోటయ్య, మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాభ్యాసంలో మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.


