రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్సై
పున్నమి న్యూస్
20 మే 2026
సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకుని, తన తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని సహాయం కోసం పోలీసులను ఆశ్రయించిన అభిషేక్ అనే యువకుడు
తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలని పోలీస్ స్టేషన్కు రావాలని పిలిచి డబ్బులు అడిగిన మహిళా ఎస్ఐ నందిత
డబ్బులు ఇచ్చేందుకు అభిషేక్ నిరాకరించడంతో, తండ్రిని కొట్టాడని అభిషేక్పై కేసు నమోదు చేసి జైలుకు పంపించిన ఎస్సై
జైలు నుండి బెయిల్ మీద విడుదలయ్యాక ప్రతీ సోమవారం సంతకం చేసేందుకు స్టేషన్కు వస్తున్న అభిషేక్ను రూ.10 వేలు డిమాండ్ చేసిన రైటర్ విజయ్,రూ.30 వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ నందిత
దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన అభిషేక్
స్కూటీ తాళం ఇచ్చి డిక్కీలో డబ్బులు పెట్టమని బాధితుడికి చెప్పిన నందిత
బాధితుడి ఫిర్యాదు మేరకు స్కూటీలో డబ్బులు పెట్టగానే, ఎస్ఐ నందితను, రైటర్ విజయ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు


