కిర్లంపూడి, జూలై 21 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
ప్రతిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడిలో మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యేతో కలిసి నివాళులర్పించి, ముద్రగడ పద్మనాభం గారు ప్రజా సేవలో చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.



