Tuesday, 8 September 2026
  • Home  
  • మర్రిపాడులో చెరువు శిఖం భూముల కబ్జాపర్వం.. పట్టించుకోని అధికారులు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడులో చెరువు శిఖం భూముల కబ్జాపర్వం.. పట్టించుకోని అధికారులు!

మర్రిపాడు మండలంలోని చినమాచునూరు పంచాయతీ పోలీరెడ్డిపల్లి చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు దళారుల అండతో సుమారు పది ఎకరాలకు పైగా చెరువు భూమిని చదును చేసి, మట్టి పోస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు కట్టను తొలగించడంతో పాటు తూమును పూడ్చివేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు, రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెరువు భూములు ఆక్రమణకు గురైతే సాగునీటి వనరులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, చెరువు శిఖం భూములను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆక్రమణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

మర్రిపాడు మండలంలోని చినమాచునూరు పంచాయతీ పోలీరెడ్డిపల్లి చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు దళారుల అండతో సుమారు పది ఎకరాలకు పైగా చెరువు భూమిని చదును చేసి, మట్టి పోస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు కట్టను తొలగించడంతో పాటు తూమును పూడ్చివేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు, రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెరువు భూములు ఆక్రమణకు గురైతే సాగునీటి వనరులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, చెరువు శిఖం భూములను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆక్రమణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.