పున్నమి: మన్సూరాబాద్: మన్సూరాబాద్ లోని కేబీఆర్ కన్వెన్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ రేణుక ఎల్లమ్మ పూజ స్టోర్’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. నిర్వాహకులు జొన్నలగడ్డ రామాంజనేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని జొన్నలగడ్డ రామాంజనేయులు మాట్లాడుతూ.. భక్తులకు కావాల్సిన అన్ని రకాల పూజా సామాగ్రి స్టోర్ లో అందుబాటులో ఉందని తెలిపారు. స్టోర్ రోజూ చేసుకునే పూజలతో పాటు వ్రతాలు, నోములు, హోమాలు, పెళ్లిళు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు అవసరమైన పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. ముఖ్యంగా రకరకాల సైజుల్లో అమ్మవారి విగ్రహాలు, కొత్త డిజైన్లలో ఉండే దేవుళ్ల విగ్రహాలు ప్రత్యేకంగా తెప్పించాం. ఇత్తడి, రాగి పూజా సామాన్లు, దీపాలు, పంచపాత్రలు, పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, అగర్బత్తులు, సాంబ్రాణి, పూజలకు వాడే పట్టు వస్త్రాలు, పీటలు, రుద్రాక్ష మాలలు, ఫోటోలు అన్నీ మంచి క్వాలిటీతో, రీజనబుల్ రేట్లకే ఇస్తున్నాం. ఏదైనా పూజ ఉంటే దానికి కావాల్సిన లిస్ట్ మొత్తం కిట్ లాగా కూడా ప్యాక్ చేసి ఇస్తాం”లి అని ఆయన తెలిపారు. ఇప్పటికే తమకు బోడుప్పల్, నాగోల్, కుంట్లూరు, హయత్నగర్లో బ్రాంచీలు ఉన్నాయని, అక్కడ కస్టమర్ల నుంచి మంచి సపోర్ట్, నమ్మకం లభించడంతోనే ఇప్పుడు మన్సూరాబాద్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశామని రామాంజనేయులు చెప్పారు. స్థానిక ప్రజలు తమ షాపుకు వచ్చి సేవలని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ ఓపెనింగ్ ప్రోగ్రాము గణేశుల సుబ్బారావు, గణేశుల శివ ముఖ్య అతిథులుగా వచ్చి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్, చుట్టుపక్కల కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






