✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి రాజమండ్రి రాజేంద్రనగర్ మూడో వార్డులో బుధవారం తెల్లవారుజామున ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా నేలకొరిగింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తెప్పింది అయితే వృక్షం క్రింద అక్కడే ఉన్న నిలిపి ఉన్న ఒక ఆటోపై పడటంతో అది పూర్తిగా ద్వంసమయింది ఈ ప్రమాదంలో తన జీవనాదారమైన ఆటో ధ్వంసం అవడంతో తన కుటుంబాన్ని ఎల పోషించుకోవాలని ఆటో యజమాని కన్నీరు పరిఎంతమయ్యారు తన బతుకు తెరువు కోల్పోయానని తనకు ఎవరు అండగా ఉంటారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఈ నష్టం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఆటో యజమాని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
End


