ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కోమిటగుంట్ల శివను అక్షయ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పరామర్శించారు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన శివ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ట్రస్ట్ చైర్మన్ బోడె పవన్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇర్రి కృష్ణ రెడ్డి బాధితుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన శివ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మారం రెడ్డి శివారెడ్డి, షేక్ గాయజ్ తదితరులు పాల్గొని శివ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

నెల్లూరు : కత్తిపోట్ల బాధితుడికి అక్షయ ట్రస్ట్ అండ: రూ.50 వేల సాయం!
ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కోమిటగుంట్ల శివను అక్షయ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పరామర్శించారు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన శివ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ట్రస్ట్ చైర్మన్ బోడె పవన్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇర్రి కృష్ణ రెడ్డి బాధితుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన శివ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మారం రెడ్డి శివారెడ్డి, షేక్ గాయజ్ తదితరులు పాల్గొని శివ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

