బెస్ట్ రన్నర్స్( USA) సహకారంతో. కుట్టు మిషన్లపంపిణీ..
భా
మహిళల స్వయం ఉపాధి సమాజానికి ఎంతో అవసరం అని ఆ దిశగా ప్రతి సేవాసంస్ధ పని చేయాల్సి ఉందని మాజీ కౌన్సిలర్ యువ న్యాయవాది పులి రజని పేర్కొన్నారు.
శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఐ కేర్ మిషను వ్యవస్థాపకులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయుడు పేట రోటరీ ప్రతినిధులు మునగాల కృష్ణారావు, రామ్ మోహన్,గారు హరిబాబు, శంకర్ లాల్ తదితరులు పాల్గొని నిస్వార్థంగా సేవలు అందిస్తూ సమాజానికి శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ మాధవి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమం లో రెడ్ క్రాస్ ఛైర్మన్ రవిప్రకాష్, మాజీ ఎ.ఎమ్.సి డైరెక్టర్ పులి చక్రపాణి, విశ్రాంత బ్యాంకు అధికారి కమల్ కుమార్, తోట శరణ్ తదితరులు మహిళా సాధికారత కోసం శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు మరువలేనివని కొని యాడారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాధవి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రవాస భారతీయుడు మింది శ్రీనివాస్ సహకారంతో ఎంతో మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రవాస భారతీయులు… బెస్ట్ రన్నర్స్ ఫౌండేషన్ కమిటీ..అమర్ గారికి,కృష్ణ ప్రసాద్ గారికీ మరియు టీం సభ్యులందరి సహకారం తో… శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు అందచేయడం విశేషమని పేర్కొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో తొలి సారిగా భారీగా 27 కుట్టు మిషన్లు అందచేసే అవకాశం తమ సంస్థకు దక్కిందని తెలిపారు.



