భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్,9,(పున్నమి ప్రతినిధి)
: భద్రాచలం ఐటీసీ గెస్ట్హౌస్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను బీజేపీ ఎస్సీ మోర్చా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చాపలమడుగు రాకేష్బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడం, ఎస్సీ మోర్చా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన ప్రజా కార్యక్రమాలపై మంత్రితో ఆత్మీయంగా చర్చించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని బండి సంజయ్ సూచించినట్లు రాకేష్బాబు తెలిపారు. పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణపై మంత్రి అందించిన సూచనలు స్ఫూర్తినిచ్చాయని పేర్కొంటూ బండి సంజయ్కు రాకేష్బాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.



