Wednesday, 15 April 2026
  • Home  
  • ప్రతి 90 రోజులకు ఒక జాబ్ మేళా.. స్థానిక యువతే నా ప్రాధాన్యత-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
- తిరుపతి

ప్రతి 90 రోజులకు ఒక జాబ్ మేళా.. స్థానిక యువతే నా ప్రాధాన్యత-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలోని JNTUA-SKIT కళాశాలలో ప్రజా నాయకుడు, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి 78వ జయంతిని పురస్కరించుకుని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెగా జాబ్ మేళా’కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ, వారి ధర్మపత్ని శ్రీమతి రిషితా రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 40కి పైగా ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చిన 1163 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, వారిలో ప్రతిభ కనబరిచిన 582 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు స్వయంగా నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా మన నియోజకవర్గ యువతకు అండగా ఉంటాం. ప్రతి 90 రోజులకు ఒకసారి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం” అని ప్రకటించారు. నేటి మేళాలో ఎంపిక కాని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ..ఎవరూ నిరాశ చెందవద్దని, వారికి త్వరలోనే ఉచిత నైపుణ్య శిక్షణ ఇప్పించి భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తన తండ్రి గారి జయంతి నాడు ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలోని JNTUA-SKIT కళాశాలలో ప్రజా నాయకుడు, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి 78వ జయంతిని పురస్కరించుకుని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెగా జాబ్ మేళా’కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ, వారి ధర్మపత్ని శ్రీమతి రిషితా రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 40కి పైగా ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చిన 1163 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, వారిలో ప్రతిభ కనబరిచిన 582 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు స్వయంగా నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా మన నియోజకవర్గ యువతకు అండగా ఉంటాం. ప్రతి 90 రోజులకు ఒకసారి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం” అని ప్రకటించారు. నేటి మేళాలో ఎంపిక కాని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ..ఎవరూ నిరాశ చెందవద్దని, వారికి త్వరలోనే ఉచిత నైపుణ్య శిక్షణ ఇప్పించి భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తన తండ్రి గారి జయంతి నాడు ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.