శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి 78వ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలో సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. 24వ వార్డు మాజీ కౌన్సిలర్ భీమాల మునికృష్ణ మరియు పట్టణ యువత ఉపాధ్యక్షుడు వంకాయల సిద్దలయ్య ఆధ్వర్యంలో స్థానిక భిక్షాల గాలిగోపురం వద్ద భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిరుపేదలకు, భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన బాటలోనే నేడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గట్టిపూడి విజయకుమార్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, తిరుపతి పార్లమెంట్ కోశాధికారి కంఠా రమేష్, మాజీ మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్, బాలాజీ రెడ్డి, ఖాదర్, పార్టీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బొజ్జల ఆశయాల బాటలో కార్యకర్తలు-జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి 78వ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలో సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. 24వ వార్డు మాజీ కౌన్సిలర్ భీమాల మునికృష్ణ మరియు పట్టణ యువత ఉపాధ్యక్షుడు వంకాయల సిద్దలయ్య ఆధ్వర్యంలో స్థానిక భిక్షాల గాలిగోపురం వద్ద భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిరుపేదలకు, భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన బాటలోనే నేడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గట్టిపూడి విజయకుమార్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, తిరుపతి పార్లమెంట్ కోశాధికారి కంఠా రమేష్, మాజీ మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్, బాలాజీ రెడ్డి, ఖాదర్, పార్టీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

