దేశభక్తి భావనను చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని హర్ ఘర్ తిరంగా ఖమ్మం జిల్లా కన్వీనర్ వేల్పుల సుధాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. జాతీయ జెండా మన దేశ గౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని సుధాకర్ కోరారు.



