చంద్రగిరి ఆగస్టు 05 పున్నమి ప్రతినిధి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బంధర్లపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సాగు చేస్తున్న ఎన్. నాగభూషనమ్మ పొలాలను సందర్శించారు.. నాగభూషనమ్మ ఒక ఎకరం పొలంలోని ఏటీఎం మోడల్ పిఎండిఎస్ ఫీల్స్ విజిట్ చేసి పిఎండిఎస్ లోని పంటను పశుగ్రాసంగా వినియోగించుకునే విధానం పిఎండిఎస్ వల్ల కలిగే లాభాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది . ఏటీఎం మోడల్ లో ప్రతి నెల వారికి వచ్చే 10 నుండి 15 వేల ఆదాయాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉన్నటువంటి ఇన్పుట్స్ అయినా పిఎండిఎస్ ప్రీ మనసున్ డ్రై సోయింగ్ లో విత్తనాలను ఏ విధంగా పెల్లటైజషన్ చేసుకునే విధానం గురించి డెమో రూపం ప్రత్యక్షంగా చూపించి తిరుపతి జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఏ. షణ్ముగాం తెలియచేయడం జరిగింది. నాగలమ్మ ప్రకృతి వనరుల కేంద్రమైన బి ఆర్ సి ని విజిట్ చేసి బి ఆర్ సి సెంటర్ ద్వారా ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్స్ రైతులకు ఏ విధంగా అందుబాటులో ఉంచుతున్నారు ఇప్పటివరకు నాగలమ్మ బిఆర్సిలో రైతులు కొనుగోలు చేసిన ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్స్ వివరాలు రిజిస్టర్స్ లో నమోదు చేసినవి కూడా విసిట్ చేసి వెరిఫై చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం ఎస్ ఎస్ జి మహిళ సంఘాలతో ముందుకు తీసుకెళ్లే ప్రక్రియను ఆ ఎస్ ఎస్ జి మహిళల సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్న విధానం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఎస్ ఎస్ జి మీటింగ్లలో ఏ విధంగా చేర్చిస్తున్నారు గ్రామములో ప్రకృతి వ్యవసాయం పై వివో లో చర్చించే చర్చల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం పట్టాభి రెడ్డి తిరుపతి జిల్లా టెక్నికల్ ఇన్చార్జి రవిచంద్ర ప్రసాద్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మధు, శ్రీదేవి, ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు




