పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వివాదాస్పదమైన రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది. వీటిలో ప్రధానమైన ‘వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్–2026’ ప్రకారం, సమాజానికి ముప్పుగా భావించే వ్యక్తిని విచారణ పూర్తికాకముందే గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు నిర్బంధించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. నిర్బంధితుల కేసులను పరిశీలించేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సలహా మండలిని ఏర్పాటు చేయనున్నారు. మరో బిల్లులో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన వారికి నష్టపరిహారం వసూలు చేసే నిబంధనను చేర్చారు. ప్రతిపక్షాలు ఈ చట్టాలను ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని విమర్శించగా, ప్రభుత్వం మాత్రం చట్టవ్యవస్థను బలోపేతం చేయడానికేనని స్పష్టం చేసింది.

పశ్చిమ బెంగాల్లో ఏడాది వరకు నిర్బంధానికి కొత్త చట్టం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వివాదాస్పదమైన రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది. వీటిలో ప్రధానమైన ‘వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్–2026’ ప్రకారం, సమాజానికి ముప్పుగా భావించే వ్యక్తిని విచారణ పూర్తికాకముందే గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు నిర్బంధించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. నిర్బంధితుల కేసులను పరిశీలించేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సలహా మండలిని ఏర్పాటు చేయనున్నారు. మరో బిల్లులో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన వారికి నష్టపరిహారం వసూలు చేసే నిబంధనను చేర్చారు. ప్రతిపక్షాలు ఈ చట్టాలను ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని విమర్శించగా, ప్రభుత్వం మాత్రం చట్టవ్యవస్థను బలోపేతం చేయడానికేనని స్పష్టం చేసింది.

