చెన్నరావుపేట: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా స్వచ్ఛమైన రేగడి మట్టితో బొల్లెపెల్లి సమిత్ S/o బొల్లెపెల్లి మహేందర్ అనే యువకుడు వినాయకుడి విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో తయారు చేశాడు. రెండు రోజుల పాటు ప్రత్యేక శ్రమ తీసుకుని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), రసాయనాలు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన రేగడి మట్టితో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం విశేషం.పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరారు. యువకుని నైపుణ్యాన్ని, పర్యావరణ స్పూర్తిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

పర్యావరణ హితంగా మట్టి వినాయక విగ్రహం తయారీ
చెన్నరావుపేట: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా స్వచ్ఛమైన రేగడి మట్టితో బొల్లెపెల్లి సమిత్ S/o బొల్లెపెల్లి మహేందర్ అనే యువకుడు వినాయకుడి విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో తయారు చేశాడు. రెండు రోజుల పాటు ప్రత్యేక శ్రమ తీసుకుని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), రసాయనాలు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన రేగడి మట్టితో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం విశేషం.పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరారు. యువకుని నైపుణ్యాన్ని, పర్యావరణ స్పూర్తిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

