*నౌకపై దాడి ఘటన.. మృతుల్లో విశాఖ వాసి*
ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు భారతీయుల్లో విశాఖ వాసి కూడా ఉన్నట్లు దిల్లీలోని ఆంధ్రా భవన్ అధికారులు ధ్రువీకరించారు. మృతుడిని 44 ఏళ్ల మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాలగా గుర్తించారు. జూన్ 24న ఆయన వివాహ 15వ వార్షికోత్సవం ఉందని.. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేశ్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు…


