*నేడు హైదరాబాద్ కు మాజీ సీఎం జగన్!*అమరావతి:ఆగస్టు 21ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేడు హైదరాబాద్ కు బయలుదేరి రాను న్నారు. హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో నూ, ఆయన అభిమానుల్లోనూ విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరుకా నున్నారు జగన్ రాకను పురస్కరిం చుకుని ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయ కులు నగరంలో అడుగడుగునా ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. శేరిలింగం పల్లికి చెందిన బీఆర్ఎస్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యం లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ వరకు ప్రధాన మార్గా ల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.ఈ స్వాగత ఏర్పాట్ల లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది, వైఎస్ జగన్తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వా హక అధ్యక్షుడు కేటీఆర్,చిత్రాలను ఒకే కటౌట్లో పొందు పరచడం. ధీరుడు వైఎస్ జగన్కు స్వాగతం వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తుంది’ అనే ఆకట్టుకునే నినాదాలతో కూడిన ఈ బ్యానర్లు నగరం లో వెలిసి రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. గతంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ సంబంధా లు, సమీకరణాలను ప్రతిబింబించేలా ఈ కటౌట్లు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తు న్నారు. బేగంపేట, పంజాగుట్ట, రాజ్భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ భారీ ఫ్లెక్సీలు అటుగా వెళ్లే బాటసారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.



