దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో కలిసి హాజరైన ఆయన, రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తొలి విడతగా రూ.6 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి తాగునీరు, పారిశుధ్యం, భద్రత, ట్రాఫిక్, వైద్య సేవలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే కాకర్ల సమీక్ష.. రూ.12 కోట్లతో ఆలయ సమగ్ర అభివృద్ధి పనులు
దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో కలిసి హాజరైన ఆయన, రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తొలి విడతగా రూ.6 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి తాగునీరు, పారిశుధ్యం, భద్రత, ట్రాఫిక్, వైద్య సేవలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

