ANM Suicide Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తొణుకుమాల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక గ్రామ సచివాలయంలో సహాయ నర్సు మిడ్వైఫ్ (ANM) గా విధులు నిర్వహిస్తున్న శ్రీపతి సాయి చందన ప్రియ (27) తన ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు షాక్కు గురయ్యారు. తక్కువ వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచిన యువతి ఇలా ఆత్మహత్యకు పూనుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించగా, అక్కడ చందన ప్రియ చేతిరాతతో రాసిన ఆవేదనభరితమైన సూసైడ్ నోట్ (Suicide Note) లభ్యమైంది.అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను చేసిన రూ. 60 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులతో మీరు వైద్యం చేయించుకోండి” అని ఆ లేఖలో పేర్కొంది.ఆమె తల్లిదండ్రుల అనారోగ్య బాధలు, వారి వైద్య ఖర్చుల భారాన్ని తలచుకుని తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే చిల్లకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించగా, అక్కడ చందన ప్రియ చేతిరాతతో రాసిన ఆవేదనభరితమైన సూసైడ్ నోట్ (Suicide Note) లభ్యమైంది.అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను చేసిన రూ. 60 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులతో మీరు వైద్యం చేయించుకోండి” అని ఆ లేఖలో పేర్కొంది.ఆమె తల్లిదండ్రుల అనారోగ్య బాధలు, వారి వైద్య ఖర్చుల భారాన్ని తలచుకుని తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.


