విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అణగారిన వర్గాలకు తోడుగా నిలిచారని, మహిళా సాధికారతకు మరియు ప్రజా సంక్షేమానికి సరికొత్త బాటలు వేశారని ఈ సందర్భంగా కొనియాడారు. “అన్నా” అని పిలిస్తే పలికే దైవంగా కోట్లాదిమంది హృదయాలలో కొలువైన ఎన్టీఆర్ గారి ఆశయాలు, స్ఫూర్తి తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకాలని పవన్ కుమార్ బస్వాని పేర్కొన్నారు.

నటసార్వభౌముడు ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించిన భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని!
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అణగారిన వర్గాలకు తోడుగా నిలిచారని, మహిళా సాధికారతకు మరియు ప్రజా సంక్షేమానికి సరికొత్త బాటలు వేశారని ఈ సందర్భంగా కొనియాడారు. “అన్నా” అని పిలిస్తే పలికే దైవంగా కోట్లాదిమంది హృదయాలలో కొలువైన ఎన్టీఆర్ గారి ఆశయాలు, స్ఫూర్తి తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకాలని పవన్ కుమార్ బస్వాని పేర్కొన్నారు.

