పున్నమి రిపోర్టర్స్ సభ్యులు ప్రముఖ ఉపాధ్యాయుడు పెంచలరావు టీచర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్య, సామాజిక అభివృద్ధి, విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, పుస్తక పఠన అలవాట్ల పెంపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యా రంగ పురోగతికి ఉపాధ్యాయుల పాత్రతో పాటు మీడియా బాధ్యత కూడా కీలకమని పెంచలరావు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే, నిష్పాక్షిక వార్తలను అందించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలపై కూడా మీడియా దృష్టి అవసరమని పేర్కొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.



