*దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు*
యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం.. రూ.3.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణ
హైదరాబాద్: దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW)లో కేసు నమోదైంది. ఓ యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి అతడి తల్లిదండ్రుల నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది.
యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన గుడ్లూరి అశోక్ బాబు, ఆ మేరకు సినిమా అవకాశాలు కల్పించకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు.
దీంతో యువకుడి తల్లిదండ్రులు సైబరాబాద్ EOW అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



