శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం తొండమనాడులో వెలసియున్న చారిత్రాత్మక వేంకటేశ్వర స్వామి ఆలయం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. చైనాకు చెందిన చెన్, లు తో పాటు కెన్యాకు చెందిన అశోక్ రెడ్డి గురువారం ఈ పురాతన ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టతను, శిల్పకళను వారు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశీ పర్యాటకులు మాట్లాడుతూ భారతదేశ ఆధ్యాత్మికత, సంస్కృతి తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రశాంతత తమకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాజులకండ్రిగ గ్రామానికి చెందిన మణిరాజు, కిషోర్ పర్యాటకులకు దగ్గరుండి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ చరిత్రను వివరించారు.

తొండమనాడు శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన చైనా, కెన్యా పర్యాటకులు
శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం తొండమనాడులో వెలసియున్న చారిత్రాత్మక వేంకటేశ్వర స్వామి ఆలయం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. చైనాకు చెందిన చెన్, లు తో పాటు కెన్యాకు చెందిన అశోక్ రెడ్డి గురువారం ఈ పురాతన ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టతను, శిల్పకళను వారు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశీ పర్యాటకులు మాట్లాడుతూ భారతదేశ ఆధ్యాత్మికత, సంస్కృతి తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రశాంతత తమకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాజులకండ్రిగ గ్రామానికి చెందిన మణిరాజు, కిషోర్ పర్యాటకులకు దగ్గరుండి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ చరిత్రను వివరించారు.

