తృటిలో తప్పిన పెను ప్రమాదం
బైక్ పై తెగిపడ్డ 11 కేవి విద్యుత్ తీగ
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
చుంచుపల్లి :
మండలం లోని రామవరం బైపాస్ రోడ్డు వెంబడి ఉన్న 11 కేవి విద్యుత్ తీగ తెగి రోడ్డు పై వెళ్తున్న బైక్ మీద పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చుంచుపల్లి నుండి రామవరం వైపుగా సాయి అనే యువకుడు తన ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా రోడ్డు వెంబడి ఉన్న 11 కేవి విద్యుత్ తీగ ఒకేసారి తెగి బైక్ పై పడింది. విద్యుత్ తీగ తెగి పడుతున్న విషయం గమనించిన యువకుడు బైక్ పై నుండి దుకేసాడు. బైక్ పై నుండి దూకిన వెంటనే విద్యుత్ తీగ బైక్ పై పడిపోయింది. చాకచక్యంగా వ్యవహరించి యువకుడు ప్రాణాలను కాపాడుకున్నాడు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.



