(*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) ఆగస్టు 03 ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు,పట్టణంలో వైఎస్ఆర్సిపి నేతలపై పోలీసులు దౌర్జన్యం,వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని గూడూరు లోకి పోనివ్వకుండా రోడ్డు పై అడ్డగించిన పోలీసులురెండు గంటలకు పైగా రోడ్డు మీద నిలబెట్టి చివరికీ నడిచి కూడా పోనివ్వమని దౌర్జన్యంగా,అడ్డుకున్న పోలీసులు
నెల్లూరు జిల్లా గూడూరు లో మెగా డిఎస్సి అక్రమాలను నిరసిస్తూ వైస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
ఈసందర్బంగా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ని, నెల్లూరు వైసిపి సిటీ నియోజకవర్గం ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని..గూడూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ బూదురు గురవయ్యను.. దాదాపు రెండు గంటల సేపు రోడ్డుపై నిలిపివేశారు.
పోలీసుల దుర్మార్గ చర్యలను.. కాకాని గోవర్ధన్ రెడ్డి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు.
కూటమి ప్రభుత్వం రెడ్ బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు.
మెగా డీఎస్సీ దుర్మార్గాలను ప్రజల్లోకి,తీసుకెళ్తున్నామన్న అక్కసు తోనే వైఎస్ఆర్సిపి చేస్తున్న.పోరాటాన్ని అణచివేసేందుకే పోలీసులు ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీలు నిరసనలను అడ్కోవడం.ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు.పోలీసులు ఇదేవిధంగా వ్యవహరిస్తే.. వారు భవిష్యత్తులో తగిన మూల్యం,చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు



