జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం
పున్నమి ప్రతినిధి – కడప
రానున్న ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా మహిళా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి , జిల్లా అధ్యక్షురాలు పులి వెంకటసుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు కోరారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో మహిళా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.










