Saturday, 19 September 2026
  • Home  
  • జగనన్న కాలనీలో అవకతవకలు.. ఆర్డీవోకు బాధితుల ఫిర్యాదు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జగనన్న కాలనీలో అవకతవకలు.. ఆర్డీవోకు బాధితుల ఫిర్యాదు

ఆత్మకూరు: జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బాధితులు ఆత్మకూరు ఆర్డీవో బి.పావనికి ఫిర్యాదు చేశారు. జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో బాధితులు ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లుల సొమ్ముతో పాటు తమ వద్ద నుంచి అదనంగా నగదు తీసుకున్న కాంట్రాక్టర్లు, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. దాదాపు 700 ఇళ్లకు సంబంధించి ఇదే విధమైన సమస్య ఉందని తెలిపారు. తమకు జరిగిన నష్టంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆర్డీవోను కోరారు. ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ఆత్మకూరు: జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బాధితులు ఆత్మకూరు ఆర్డీవో బి.పావనికి ఫిర్యాదు చేశారు. జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో బాధితులు ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లుల సొమ్ముతో పాటు తమ వద్ద నుంచి అదనంగా నగదు తీసుకున్న కాంట్రాక్టర్లు, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. దాదాపు 700 ఇళ్లకు సంబంధించి ఇదే విధమైన సమస్య ఉందని తెలిపారు. తమకు జరిగిన నష్టంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆర్డీవోను కోరారు. ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.