చిట్వేల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా సాగింది. పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ శివప్రసాద్ గౌడ్, డాక్టర్ సల్మా ఆధ్వర్యంలో సచివాలయాల పరిధిలోని 50 పోలింగ్ బూత్లలో జననం నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో నివారణ చుక్కలు వేశారు. మొదటి రోజే సుమారు 96 శాతం మంది చిన్నారులకు డ్రాప్స్ అందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమవారం, మంగళవారం ఏఎన్ఎంలు, ఏడబ్ల్యూతీలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ, పీహెచ్ఎన్, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఏడబ్ల్యూతీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

చిట్వేల్లో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం
చిట్వేల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా సాగింది. పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ శివప్రసాద్ గౌడ్, డాక్టర్ సల్మా ఆధ్వర్యంలో సచివాలయాల పరిధిలోని 50 పోలింగ్ బూత్లలో జననం నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో నివారణ చుక్కలు వేశారు. మొదటి రోజే సుమారు 96 శాతం మంది చిన్నారులకు డ్రాప్స్ అందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమవారం, మంగళవారం ఏఎన్ఎంలు, ఏడబ్ల్యూతీలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ, పీహెచ్ఎన్, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఏడబ్ల్యూతీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

