చంద్రబాబు నాయుడు తుమ్మలపెంట పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
తేది: 18.05.2026 | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న తుమ్మలపెంట పర్యటనకు రానున్న నేపథ్యంలో SPSR నెల్లూరు జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు. రూట్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, యాంటీ సబోటేజ్ చెకింగ్, రోడ్ ఓపెనింగ్ పార్టీ (ROP) విధులు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, భద్రంగా జరిగేలా మొత్తం 858 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్.పి. వెల్లడించారు.



