శ్రీకాళహస్తి పట్టణం లోని సెయింట్ జేవియర్స్ పాఠశాల నందు తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ షెర్లి ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలుగు భాషా పండితులు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి పంతులు వారి జన్మదినం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటామని, గిడుగు వారు వ్యావహారిక భాషోద్యమానికి పితామహుడని,వారు తెలుగు భాషాభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏకాపాత్రాభినయం,తెలుగు భాష గొప్పతనాన్ని గూర్చి నృత్య ప్రదర్శన చేసి అలరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




