ఖమ్మం, జూలై
(, పున్నమి న్యూస్ )
ఆగస్టు 1 నుంచి ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రజలకు అందుబాటులోకి రానున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఖమ్మం జిల్లా శాఖ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శాసనల సాయిరామ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ హైవేతో ఖమ్మం ప్రాంత అభివృద్ధికి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు, ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీ. కొండా శ్యాం, వాళ్లాల రమేష్, కొమ్మ మధు తదితర బీజేపీ యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.



