విశాఖపట్నం, కూటమి ప్రభుత్వంలో సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులకు సిపిఎస్ నుంచి ఓ పి ఎస్ కు మార్చిన సందర్భంగా విశాఖపట్నం స్వర్ణ భారతి స్టేడియంలో కృతజ్ఞతా సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలసి ప్రభుత్వవిప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపే సభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగస్తులకు, పేదలకు అండగా ఉంటుందని అన్నారు. సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు మార్చిన ఉపాధ్యాయులు గుర్తుంచుకొని కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.



