Saturday, 13 June 2026
  • Home  
  • కావలి ఏరియా ఆస్పత్రిలో శిశువుల మార్పిడి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి !
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి ఏరియా ఆస్పత్రిలో శిశువుల మార్పిడి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి !

కావలి ఏరియా ఆసుపత్రి లో మంగళవారం జరిగిన శిశుమార్పిడి దుర్ఘటన హాస్పిటల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణా లోపం ,సిబ్బంది విధినిర్వహణా నిర్లక్ష్యానికి నిదర్శనం అని సామాజిక కార్యకర్త శారద ఆరోపించారు. ఏ తల్లిదండ్రులైనా .తమ బిడ్డే తమకు కావాలని కోరుకుంటారు ప్రసవవేదనను భరించి తనబిడ్డనే ఏ తల్లి అయినా కోరుకుంటుందని . ఇది సక్రమంగా జరిగేలా చూసేబాధ్యత పూర్తిగా ., ఆ ఆస్పత్రిదే ! దీనిని పవిత్ర వృత్తిధర్మం గా భావించి సూపరింటెండెంట్ సిబ్బంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తేనే జరుగుతుందని అన్నారు. మగబిడ్డ ఆడబిడ్డ ప్రసక్తి లేకుండా ధర్మనిర్వహణ చేయాల్సి ఉండగా. దీనికి విరుద్ధంగా మంగళవారం కావలి ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళ 10 గంటలకు ప్రసవించిన మగబిడ్డ స్థానంలో 12 గంటలప్పుడు ఆడబిడ్డను ఇవ్వడం అనే సంఘటన జరగడం , బిడ్డతల్లి, బంధువుల ఆందోళన జరగడం దశాబ్దాల చరిత్రగల కావలి ఏరియా ఆస్పత్రికి తీరని అవమానం గా శారద పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో లోతైన విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆదేశాలు ఇవ్వాలని ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ శారద,, జి. లావణ్య , పార్వతీశంకర్ తదితర సభ్యులు డిమాండ్ చేశారు.

కావలి ఏరియా ఆసుపత్రి లో మంగళవారం జరిగిన శిశుమార్పిడి దుర్ఘటన హాస్పిటల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణా లోపం ,సిబ్బంది విధినిర్వహణా నిర్లక్ష్యానికి నిదర్శనం అని సామాజిక కార్యకర్త శారద ఆరోపించారు.
ఏ తల్లిదండ్రులైనా .తమ బిడ్డే తమకు కావాలని కోరుకుంటారు
ప్రసవవేదనను భరించి తనబిడ్డనే ఏ తల్లి అయినా కోరుకుంటుందని . ఇది సక్రమంగా జరిగేలా చూసేబాధ్యత పూర్తిగా ., ఆ ఆస్పత్రిదే ! దీనిని పవిత్ర వృత్తిధర్మం గా భావించి సూపరింటెండెంట్ సిబ్బంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తేనే జరుగుతుందని అన్నారు.
మగబిడ్డ ఆడబిడ్డ ప్రసక్తి లేకుండా ధర్మనిర్వహణ చేయాల్సి ఉండగా. దీనికి విరుద్ధంగా మంగళవారం కావలి ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళ 10 గంటలకు ప్రసవించిన మగబిడ్డ స్థానంలో 12 గంటలప్పుడు ఆడబిడ్డను ఇవ్వడం అనే సంఘటన జరగడం , బిడ్డతల్లి, బంధువుల ఆందోళన జరగడం దశాబ్దాల చరిత్రగల కావలి ఏరియా ఆస్పత్రికి తీరని అవమానం గా శారద పేర్కొన్నారు.
దీనిపై ఉన్నతాధికారులతో లోతైన విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆదేశాలు ఇవ్వాలని ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ శారద,, జి. లావణ్య , పార్వతీశంకర్ తదితర సభ్యులు డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.