ఖమ్మం బీజేపీ టూ టౌన్ మండల కార్యవర్గ సమావేశం అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఆధ్వర్యంలో శనివారం విజయవంతంగా నిర్వహించారు. టూ టౌన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో బీజేపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఇన్చార్జి జ్వాలా నరసింహారావు, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, వల్లభనేని పుల్లయ్య, బోయిల వెంకట్, నక్కల రవి గౌడ్, మహేందర్ సింగ్, ఎల్లారావు గౌడ్, బోయినపల్లి సురేష్ గౌడ్, కన్నెకంటి కృష్ణచారి, రుద్రగాని మాధవరావు, దాసరి వీరభద్రం, జిల్లెల్ల నాగరాజు, తుమ్మాటి ఉపేంద్ర, కాసం మమత, దొడ్డపునేని అప్పారావు, దాసరి మధు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



