సాగు చేసిన పంటల ఆధారంగా కార్డుల ద్వారానే రైతులకు ఎరువులు అందించాలని జిల్లా వ్యవసాయాధికారిణి (డీఏఓ) పుట్టా సత్యవాణి స్పష్టం చేశారు. ఖరీఫ్కు కావలసిన ఎరువులను అందుబాటులో ఉంచాలని వింజమూరు, ఆత్మకూరు సమావేశాల్లో డీలర్లకు, అధికారులకు సూచించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఖరీఫ్లో వరి సాగు:- ఉదయగిరి పరిధిలో ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 3.75 లక్షల ఎకరాల్లో వరి, మరో 30 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని డీఏఓ సత్యవాణి పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ఏడీఏలు, మార్క్ఫెడ్ డీఎం పవన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.


