కాకినాడ: స్వాతంత్ర్యం కోసం ఒక తరం పోరాటం చేస్తే, మరో తరం దానిని కాపాడిందని, దేశ నిర్మాణానికి పునాదులు వేయాల్సిన బాధ్యత ప్రస్తుతం తరంపై ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేస్తూ.. “వేగం అనేది సత్యం కాదు” (Speed is not truth) అని, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు అందులో వాస్తవం ఉందా లేదా అని ఆలోచించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి కాకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. వ్యవస్థల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దాలే తప్ప, ఆస్తులను ధ్వంసం చేయడం మాత్రం మార్గం కాదని తన ఉద్యమ ప్రయాణాన్ని గుర్తు చేశారు. యువత దుబ్బుకు ఓటు వేయకుండా, సమస్యలకు పరిష్కారం చూపే శక్తిగా ఎదిగి భారతదేశాన్ని నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.

















